జనసేన ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి వేడుకలు

మైలవరం: కొండపల్లి మున్సిపాలిటీ ఎస్.టి కాలనీలో ఏకలవ్య జయంతిని గురువారం జనసేన పార్టీ రాగాల నాని ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరిగింది. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి అక్కల్ రామ్మోహన్ రావు (గాంధీ) మాట్లాడుతూ.. ఏకల వీరుడు గొప్పతనం గురించి ఆయన జీవన శైలి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో చెరుకుమల్లి సురేష్ కుమార్, ఎర్రంశెట్టి నాని, నాగబాబు, సామల సుజాత, కొత్త గేటు సురేష్, రమేష్, హేమంత్, వెంకట్ సాయి, రామ్ ఆంజి, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.