చిత్రాడ గ్రామంలో పవన్ కళ్యాణ్ మద్దతుగా ఎన్నికల ప్రచారం!

పిఠాపురం మండలం: పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను భారీ మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాలని బీజేపీ నియోజవర్గ ఇంచార్జ్ బుర్రా కృష్ణంరాజు కోరారు. చిత్రాడ గ్రామంలో ఇంటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. సంక్షేమం, అభివృద్ధి సుస్థిర పాలన ప్రజలకు అందించే సామర్థ్యం కూటమికి మాత్రమే ఉందన్నారు. వైసీపీ 5ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో 20 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు అప్పులు మయంలో రాష్ట్రం ఒక డెవలప్మెంట్ కానీ లేదని రానున్న రోజుల్లో మన ప్రభుత్వం వచ్చి ప్రజలకు మంచి రోజులు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే ఏ ఇంటికి వెళ్లిన వాటర్ ని అడిగిన ప్రతి ఒక్కరి మాట గాజు గ్లాస్ కి ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేగా నెగ్గించి అసెంబ్లీకి పంపిస్తామని ప్రతి ఒక్కరి నోట రావటం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బిజెపి నాయకులు తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు.