Tanuku: జనసేనతోనే అభివృద్ధి – విడివాడ రామచంద్రరావు

కె. కుముదవల్లి ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో శ్రీ విడివాడ రామచంద్రరావు

తణుకు నియోజకవర్గఅం స్థానిక సంస్థలకు జరుగుతున్న ఉప ఎన్నికల ద్వారా ప్రజా కంటక పాలకులకు బుద్ది చెప్పాలని జనసేన పార్టీ తణుకు నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ విడివాడ రామచంద్రరావు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డున పడ్డారని ఆరోపించారు. అభివృద్ధి కావాలంటే జనసేన రావాలని తెలిపారు. కె. కుముదవల్లి నుంచి జనసేన అభ్యర్ధిగా బరిలోకి దిగిన శ్రీ పిండి గోవిందరాజు తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇరగవరం మండలాధ్యక్షులు శ్రీ ఆకేటి కాశీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. జనసేనకు ఓటు వేసి మార్పుకు మద్దతు ఇవ్వాలని కోరారు.