ఇచ్చాపురం జనసేన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కండ్రవీధిలో ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త దాసరి రాజు ఆధ్వర్యంలో “జేమ్స్ హాస్పిటల్” వైద్య బృందం సౌజన్యంతో శనివారం నాడు “ఉచిత మెగా వైద్య శిబిరం” బెహరా సంఘ అధ్యక్షులు జితేంద్ర బెహరా ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగినది. ఈ వైద్య శిబిరంలో కిడ్నీ, గుండె, కేన్సర్ మరియు సాధారణ వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగినది. 410 మందికి బీపి, షుగర్, ఈసీజి వైద్య పరీక్షలు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జేమ్స్ డాక్టర్స్ హూహస్ రెడ్డి, పవన్ భార్గవ్, సూర్య వంశీ మరియు జనసేన రాష్ట్ర సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, మత్స్యకార విభాగ వికాస కార్యదర్శి హరి బెహరా మున్సిపాలిటీ వార్డు ఇంచార్జ్ లు రోకళ్ళ భాస్కర్ రావు, సంతోష్ మహరణ, ఢిల్లీ బిసాయి కల్య దాసరి శేఖర్ మరియు ఇచ్చాపురం జనసేన నియోజకవర్గ నాయకులు పాల్గొనడం జరిగినది.