అంబేద్కర్ కు ఎమ్మిగనూరు జనసేన ఘన నివాళి

ఎమ్మిగనూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా.. వేడుకలు పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ గారి జీతం యువతకు స్ఫూర్తి అని.. ఆయన రచించిన రాజ్యాంగం వల్ల నేడు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవిస్తున్నారని నేటి యువత అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుంటూ.. ఆయన అడుగు జాడల్లో నడవాలని ప్రతి ఒక్కరికీ మార్గదర్శిగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సబీర్ వెంకటేష్, రమేష్, మళ్లీ సూర్య తదితరులు పాల్గొన్నారు.