పోలవరంలో జనసేనలో చేరికలు

పోలవరం, కొయ్యలగూడెం మండలంలో మండల అధ్యక్షులు తోట రవి మరియు టౌన్ అధ్యక్షులు మాదేపల్లి శ్రీను ఆధ్వర్యంలో అధికార వైసిపి పార్టీ నుంచి సుమారు 100 కుటుంబాలు పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో నచ్చి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పోలవరం నియోజకవర్గం ఇన్చార్జి చిర్రి బాలరాజు సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. వైసిపి పార్టీ ఎప్పుడు అయితే అధికారంలోకి వచ్చిందో 2019 నుంచి ప్రారంభమైన పార్టీ చేరికల ప్రభంజనం నేటికీ దిగ్విజయంగా సాగుతుంది. వైసీపీ ప్రభుత్వం యొక్క అసమర్ధ పాలన, స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజు యొక్క అసమర్థత వాళ్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాది ప్రజల ప్రభుత్వం అని చెప్పి పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలను మోసం చేసి నేడు ఏ రోజు ఏ ధర పెరుగుతుందో అని భయానికి లోనయ్యాలా చేశాడని, ఇలాంటి పిచ్చివాడి పాలనా పోవాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని, ఇందుకు ప్రతి ఒక్కరం కష్టపడి పని చేయాలని ఇప్పుడు మనం పడే కష్టం రేపు మన యొక్క భావి తరాల కోసమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగడ రమేష్, ఏపూరి సతీష్, మల్లబత్తుల రాము, మోదుగ గంగాధర్, కసుమతి ఉమా, అప్పన ప్రసాద్, గ్యాలం భాస్కర్, చెప్పుల మధు, మేడిన కన్నయ్య, పసుపులేటి వెంకటేశ్వరరావు, ఆకుల పుల్లారావు, శేషణ సూర్యచంద్రం కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.