జనసేనానితో తోట సుబ్బారావు మర్యాదపూర్వక భేటీ

హైదరాబాద్, జనసేన పార్టీ కేంద్రకార్యాలయంలో శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గిద్దలూరు జనసేన నాయకులు తోట సుబ్బారావు మర్యాదపూర్వకంగా కలిసి వివిధ అంశాలపై చర్చించడం జరిగింది. ఇతర పార్టీల నాయకుల చేరికలు, ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులను కలుపుకుని పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసి విజయం దిశగా అడుగులు వేయాలని తోట సుబ్బారావుని పవన్ కళ్యాణ్ సూచించడం జరిగింది.