వైసీపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలను ఖండించిన ఎచ్చెర్ల జనసేన

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ళు దాటినా శ్రీకాకుళం జిల్లాలోని ఏ ఒక్క సమస్యలను తీర్చలేని అసమర్థ ప్రభుత్వం అని ప్రజలు గ్రహించారు. కాబట్టే ఉత్తరాంధ్ర ప్రజలు పవన్ కళ్యాణ్ నాయకత్వం కోరుకుంటున్నారనే, అక్కసుతో వ్యక్తిగత దూషణలు చేస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరియు మంత్రి సిదిరి అప్పలరాజు లను జిల్లాలో మీరుచేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. జిల్లాలో పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టి మీరు చేస్తున్న అక్రమాలతో త్వరలోనే జైలుకు పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎచ్చెర్ల నియోజకవవర్గం జనసైనికులు జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు బార్నాల దుర్గారావు దొర రాజారమేష్ జనసైనుకులు అసహనం వ్యక్తం చేశారు.