వైసీపీ నాయకులపై రాయచోటి జనసేన అసెంబ్లీ ఇన్చార్జ్ ఫైర్

రాయచోటి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు విమర్శించే స్థాయి మీకు లేదని రాయచోటి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ హసేన్ బాషా హెచ్చరించారు. రాయచోటిలోని అంబేద్కర్ విగ్రహానికి జనసేన నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాయచోటి అసెంబ్లీ ఇన్చార్జ్ హసేన్ బాషా మాట్లాడుతూ నిజాయితీ గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందని అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ చేయనన్ని సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ చేస్తూ ఉందని ఇది చూసి అధికార వైసిపి పార్టీ నాయకులు జనసేన పార్టీపై బురద జల్లుతున్నారని అన్నారు. రాష్ట్రంలో గతంలో ఉన్న అప్పులు ఎంత ఇప్పుడున్న అప్పులు ఎంత అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామ శ్రీనివాసులు, రియాజ్, బాబ్జి, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.