బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం

రాజానగరం, కోరుకొండ మండలం బస్టాండ్ వద్ద డొక్కా సీతమ్మ నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించిన జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మరియు వారి కుమార్తె వందనాంబిక. రాజకీయాలకు, కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం రాజానగరం, సీతానగరం మరియు కోరుకొండ బస్టాండ్ ల వద్ద ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రికి, దినసరి పని కోసమో, వివిధ ఆరోగ్య పరీక్షల కోసమో మరియు ఇతర పనుల కొరకు గానీ వచ్చిన, పేద వారు, ప్రయాణికులు, బాటసారులు, వృద్దులు, బిక్షాటన చేసుకునే వారు, ఇలా ఆకలితో వచ్చిన వందలాదిమంది ఈ అన్నదాన కార్యక్రమంలో తృప్తిగా భోజనం చేయడం జరిగింది. బత్తుల బలరామకృష్ణ రాజానగరం నియోజకవర్గంలో ఎవరు ఆకలితో ఉండకూడదు అని కడుపునిండా అన్నం పెట్టి ఆదుకున్నారని ప్రజలంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు. వందలాది గొంతుకలు అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.