జనసేన పార్టీ చందానగర్ డివిజన్ ఆత్మీయ సమావేశం

శేరిలింగంపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి డాక్టర్ మాధవ రెడ్డి ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో చందానగర్ డివిజన్ అద్యక్షులు బి అరుణ్ కుమార్ పాల్గొని రానున్న రోజుల్లో జనసేన పార్టీని డివిజన్ స్థాయిలో అనుసరించ వలసిన వివరాలను తెలియ చేశారు. ఈ ఆత్మీయ సమావేశంలో డివిజన్ జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొని పార్టీ బలోపేతానికి అభిప్రాయలను తెలియచేశారు అందరి ఆలోచనలను పరిగణలోకి తీసుకుని పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకుంటామని అదే విధంగా మునుముందు జనసేన పార్టీ సిద్ధాంతాలను నియోజవర్గస్థాయిలో ప్రతి గడప గడపకు తీసుకెళ్లే కార్యచరణ రూపొందిస్తున్నట్లు మాదవరెడ్డి తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.