జనసేన నాయకుల ఆధ్వర్యంలో వరద బాదితులకు అన్నదాన కార్యక్రమం

వి.ఆర్.పురం మండలం: గోదావరి వరదలకు సర్వం కోల్పోయి ఇబ్బందుల పడుతున్న వి.ఆర్.పురం మండలంలోని ప్రజలకు జనసేన పార్టీ తరఫున గుంటూరుకు చెందిన చెరుకూరి సురేష్ బాబు, నాగ భావన ఆధ్వర్యంలో 3వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధర్మతాళ్లగూడెం నుండి సాగిన ఈ పంపిణీ కార్యక్రమం వి.ఆర్.పురం, బి.సి కాలనీ నుండి రేఖపల్లి మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో నాగ భావన తో మండల అధ్యక్షుడు ములకాల సాయికృష్ణ ఉన్నారు. ఈ సందర్బంగా సాయికృష్ణ మాట్లాడుతూ.. ప్రత్యేకంగా వరద బాధితుల సహాయార్థం గుంటూరు నుండి వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న భావన దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో జె. నాగు, సాయి, నమ్రత, దుర్గా ప్రసాద్, అయ్యప్ప(పీ. కే), నవీన్, రవి, పోషి రెడ్డి, తేజ, రమేష్, శివ, సమేష్, పండు మరియు అన్ని గ్రామాల జనసైనికులు పాల్గొన్నారు.