ప్రముఖ సినీ నటులు చెంబోలు రాజాకు ఘన సన్మానం

వైజాగ్: ప్రముఖ సినీ గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు చెంబోలు రాజాకు మంగళవారం విశాఖపట్నం స్థానిక పార్కు హోటల్లో స్వచ్ఛంద సేవా సంస్థ ఆప్ సబ్ కి ఆవాజ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాగాయకుడు మజ్జిదేవిశ్రీ మాట్లాడుతూ సినీ సాహితీ లోకంలో ధ్రువతారగా నిలిచినటువంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో తన పాటల ద్వారా బ్రతికే ఉంటారని దేవిశ్రీ అన్నారు. సీతారామశాస్త్రి కుమారుడుగా రాజా తను నటించిన సినిమాల్లో ఇప్పటికే సత్తా చాటాడని భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందిపుచ్చుకోవాలని దేవిశ్రీ అన్నారు. ఆప్ సబ్ కి ఆవాజ్ ఫౌండర్ బావిశెట్టి కిరణ్ మాట్లాడుతూ సీతారామశాస్త్రి ఆశయాలను తీసుకొని వెళ్లడంలో రాజా ఎప్పుడు ముందు ఉంటారని భవిష్యత్తులో అనేక సినిమాలో నటించి సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఓ మంచి వారసుడిగా ఉండాలని ఆకాంక్షించారు నటనలో రాజా తారాస్థాయికి చేరుకోవాలని కిరణ్ కోరారు ఈ కార్యక్రమంలో బావిశెట్టి వెంకట్రావు, వడ్లమూడి శివ, కొండేటి భాస్కర్, విద్యాసాగర్, కనకరాజు, డాక్టర్ మణికంఠ, యోగి, పోలిశెట్టి సూర్య ప్రకాష్, తాసుబెల్లి శంకర్ నాయుడు, అఖిల్, మజ్జి మహిధర్ తదితరులు పాల్గొన్నారు.