రైతుల సంక్షేమమే జనసేన పార్టీ లక్ష్యం: రామ శ్రీనివాస్

రాజంపేట: రైతుల సంక్షేమమే జనసేన పార్టీ లక్ష్యమని జనసేన నాయకులు రామ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సుండుపల్లె మండలంలో ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సుండుపల్లి మండల కేంద్రంలో రైతులను ఘనంగా సన్మానించారు. అలానే కేక్ కట్ చేసి ప్రజలందరికీ పంచి పెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం జనసేన పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందనీ తెలియజేశారు. చనిపోయిన 3000 మంది రైతు కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేయడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు అండగా ఉంటుందని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మచ్చ లక్ష్మీనారాయణ, వంటేరు రాజా, సలీం, రఫీక్, వీరమహిళ రెడ్డిరాణి, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.