గణపతి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం, మంగాపాలెం గ్రామం, ముమ్మిడివరం మండలం, క్రాప చింతలపూడి గ్రామం, ఐనాపురం గ్రామం, కాట్రేనికోన మండలం, చెయ్యేరు కొమ్మాయిపాలెం గ్రామం మరియు దొంతికుర్రు గ్రామాలలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన గణపతి స్వామిని దర్శించి, అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), సానబోయిన మల్లికార్జునరావు, సంసాని పాండురంగా రావు, పితాని రాజు, సలాది రాజా, గంజా యేసు, గోలకోటి పణి, అయ్యల శ్రీను మొదలగువారు పాల్గొన్నారు.