వీరఘట్టంలో టిడిపి రిలే దీక్షకు జనసేన మద్దతు

పాలకొండ నియోజకవర్గం: స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా పాలకొండ నియోజకవర్గ శాసన సభ సభ్యులు నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షకు పాలకొండ జనసేన పార్టీ నాయకులు నిమ్మల నిబ్రమ్ అదేశాలు మేరకు పార్టీ నాయకులు గోర్లే మన్మధ రావు, కర్ణేన సాయి పవన్, మత్స పుండరీకం, అచ్చుత్ రావు, సుమన్, కే.వి.ఆర్ నాయుడు, జి.నరేంద్రలు జనసైనుకులతో కలిసి వీరఘట్టం మండల కేంద్రంలోని సాయి నగర్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పువ్వుల మాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం దీక్షా శిబిరం వద్దకు పాదయాత్ర చేస్తూ పవన్ రావాలి – పాలన మారాలి.. సీఎం డౌన్ డౌన్.. హలో ఏ.పి – బై బై వైసీపీ అంటూ నినాదాలు చేస్తూ తెలుగుదేశం చేపట్టి దీక్ష శిబిరం వద్దకు వెళ్లి మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు మత్స.పుండరీకం, కర్ణేన సాయి పవన్ లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, వైస్సార్సీపీ నిరంకుశ పాలనకి చరమ గీతం పాడాలని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన – టీడీపీ మిత్రబందంతో ముందుకు వెళ్తాయని ప్రకటించారని, జనసేనాని నిర్ణయానికి కట్టుబడి టీడీపీ చేస్తున్న దీక్షకు జనసేనపార్టీ తరుపున మద్దతు తెలపడం జరిగింది అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వుదయన చరణ్, చుక్క భార్గవ్, నందివాడ పండు, సందీప్, కార్తిక్, గణేష్, శ్రీరామ్, గౌడ్ జగన్, గౌరీ, సత్యనారాయణ తదితులున్నారు.