Razole: ఐదవ రోజు సభ్యత్వ నమోదు కిట్లను అందజేసిన రాజోలు వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు

పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలనే సంకల్పంతో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం చింతలపల్లి గ్రామంలో రాజోలు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు( వైస్ ఎంపీపీ) ఇంటిపల్లి ఆనందరాజు నుండి జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులుగా చేరిన కార్యకర్తలకు ఐదవ రోజు సభ్యత్వ నమోదు కిట్లను పంపిణి చేశారు. ఈ యొక్క కిట్ లో సభ్యత్వ నమోదు కార్డుతో పాటు, 5 లక్షల ప్రమాద భీమా పత్రం, పార్టీ యొక్క 7 సిద్ధాంతాలతో కూడిన పవన్ కళ్యాణ్ ఫొటో, అధ్యక్షుల వారి మనోగతం యొక్క వివరాలు, ఒక నోట్ బుక్ అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవి కిరణ్ చేతుల మీదుగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నవారికి ఇంటికెళ్లి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్ల పూడి మధు, సూదా మోహనరంగా, పిప్పళ్ళ లక్ష్మణరావు,కోళ్ల మల్లి, వేగి రౌతు భాను గణేష్, కోళ్ల వేణు, శిరిగినీడి సాయిరాం మరియు జనసైనికులు పాల్గొన్నారు.