కురుపాంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

కురుపాం, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కురుపాం నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో భాగంగా మొదట పెదమెరింగి జంక్షన్ నుండి చిన్న మెరింగి ప్రభుత్వ ఆసుపత్రి వరకు బైక్ ర్యాలీగా వెళ్లి 30 పడకల ఆసుపత్రిలో పేషెంట్లకు, పారిశుద్ధ్య కార్మికులకు, పళ్ళు, రొట్టె, ఓఆర్ఎస్, బిస్కెట్స్ పంపిణీ చేయడం జరిగింది. తదుపరి చిన మేరింగి ప్రభుత్వ ఆసుపత్రి నుండి కురుపాం వరకు హల్లో ఏపీ బై బై వైసిపి అంటూ నినాదాలు చేసుకుంటూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది కురుపాం చేరుకున్నాక శ్రీ శ్రీ శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత కురుపాం బస్ షెల్టర్ జంక్షన్లో జనసైనికులు కురుపాం ప్రజల సమక్షంలో పుట్టినరోజులు వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా కురుపాం ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, పేషెంట్లకు, పారిశుద్ధ్య కార్మికులకు, నర్సింగ్ స్టాఫ్ కు పళ్ళు, ఓఆర్ఎస్, రొట్టె పంచటం జరిగింది. తదుపరి నియోజకవర్గ నాయకులు అందరూ కూడా రానున్న అసెంబ్లీ ఎలక్షన్లో కురుపాంలో జనసేన పార్టీని విజయం దిశగా నడిపించేలా కృషి చేయాలని జనసేన నాయకులకు కార్యకర్తలకు దిశ నిర్దేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు నేరేడుబిల్లీ వంశి, గార గౌరీ శంకర్ రావు, పెంట శంకర్రావు, నియోజకవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ ఎల్. రంజిత్ కుమార్, కొమరాడ మండల అధ్యక్షులు తెంటు శ్రీకర్, జిఎం వలస మండల అధ్యక్షులు వారణాసి శివ, వావీలపల్లి రాజేష్, తాడేళ్ళ శ్రీరామ్, అనంత్, శంకర్రావు, సంతు, ప్రేమ్, పాపి నాయుడు, భార్గవ్, తారక్, శ్రీను, గౌరీ శంకర్, పోలినాయుడు, రిషి వర్ధన్, జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.