జీవనాధారం కోల్పోయిన బాలుకి అండగా మేడ గురుదత్

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, పెద్ద కొండేపూడి గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన ఆటో బాలు జీవన ఆధారమైన ప్యాసింజర్ ఆటోకి నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ఘటన స్థలాన్ని సందర్శించి అక్కడ పరిస్థితులు గ్రామస్తుల ద్వారా తెలుసుకొని బాలు కుటుంబానికి న్యాయం జరిగేలా ముందు ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ వారితో మాట్లాడం జరిగింది. భయబ్రాంతుల్లో ఉన్న బాలు కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది అని ధైర్యం కల్పించి జనసేన పార్టీ తరుపున 5,000₹ రూపాయలు ఆర్థిక సహాయం అందించిన మేడ గురుదత్. ఈ కార్యక్రమం లో సీతానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కరిచర్ల విజయ్ శంకర్, సీతానగరం మండలం జనసేన పార్టీ కో కన్వీనర్ తణుకు రమేష్ బాబు, సీతానగరం మండలకమిటీ ప్రధాన కార్యదర్శి చీడీపీ నాగేష్, చీడీపీ రెడ్డి, చల్లా ప్రసాద్ జనసైనికులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.