నల్లా శ్రీధర్ పుట్టినరోజు సందర్బంగా జనసైనికుడి కుటుంబానికి ఆర్ధికసాయం

అమలాపురం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు నల్లా శ్రీధర్ పుట్టినరోజు సందర్బంగా జనసేన పార్టీ అభిమానులు, జనసైనికులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలు కేక్ కటింగ్ ద్వారా ప్రారంభమైనాయి.. అలాగే అమలాపురం మున్సిపాలిటీ 6వ వార్డ్ కి చెందిన జనసైనికుడు చిట్నీడి దుర్గారావు ఫిబ్రవరి -7 న గుండె పోటుతో అకాల మరణం చెందటం వలన ఆ కుటుంబానికి 30,000 రూపాయలు జనసేన పార్టీ తరపున ఈ పుట్టినరోజు సందర్బంగా అమలాపురం జనసేన పార్టీ తరపున ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ జనసేన పార్టీ ఇంచార్జ్ డి ఎం ఆర్ శేఖర్, అయితాబత్తుల ఉమా, ఇసుకపట్ల రఘుబాబు, మున్సిపల్ ప్రతిపక్షనేత ఏడిద శ్రీను, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ సతీష్, రూరల్ అధ్యక్షులు లింగోలు పండు, వాకపల్లి శ్రీను, శిరిగిననీడి వెంకటేశ్వరరావు, కంచిపల్లి అబ్బులు, తిక్క శేషుబాబు, నల్లా చిట్టి, నల్లా నాయుడు, డాక్టర్ మానస, ఆకుల సూర్యనారాయణ మూర్తి, ఆర్ డి ఎస్ ప్రసాద్, బట్టు పండు, వర్రే శేషు, మోటురి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్స్ పడాల శ్రీదేవి నానాజీ, తిక్క రాణి ప్రసాద్, గొల్లకోటి వాసు విజయలక్ష్మి, తిక్క సరస్వతి, ముత్యాల మణిమ్మ, బండారు కోటేశ్వరరావు మరియు మండల నాయకులు కోనసీమ జనసైనికులు పాల్గొన్నారు.