విద్యుత్ చార్జీలు తగ్గించాలని జనసేన డిమాండ్

సూళ్లూరుపేట, విద్యుత్ చార్జీలు పెంచి నిరుపేదలపై భారం మోపడం ఈ వైసీపీ ప్రభుత్వం కి సరికాదని సూళ్లూరుపేట నియోజవర్గం నాయకులు మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి బురకాల లీలా మోహన్ అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ వైసిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ వేసవి కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఉంటున్నారని ఈ సమయంలో ఈ విద్యుత్ చార్జీలు పెంచడం కరోనా కష్టకాలంలో ఉపాధికోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలకు ఉగాది కానుకగా 14 కోట్ల విద్యుత్ భారం మరియు 3 వేలకోట్ల రూపాయలు ట్రాప్ కింద ఛార్జీలు సామాన్య ప్రజలపై భారం వేయడం చాలా దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు.