డాక్టర్ కందులకు ఫస్ట్ బెస్ట్ గవర్నర్ అవార్డు

విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్, వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కందుల నాగరాజుకు ఫస్ట్ బెస్ట్ గవర్నర్ అవార్డును అందజేశారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. రాజకీయ నాయకుడిగా, సోషల్ వర్కర్ గా, వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఆయన ఎన్నో సేవలను చేశారు. నేటికీ కూడా ఆయన నిర్విరామంగా సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు డాక్టర్ కందుల నాగరాజ్ కు ఈ అవార్డు రావడం పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. కుల మతాల కతీతంగా, రాజకీయాలకతీతంగా, వర్గాల కతీతంగా డాక్టర్ కందుల నాగరాజ్ చేస్తున్న సేవలకు ప్రశంసలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఈ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మన సేవలను గుర్తించి నిర్వాహక కమిటీ ఈ అవార్డు ఎంపిక చేయడం సంతోషమని తన ఆనందాన్ని తెలియజేశారు. భవిష్యత్తులో కూడా తన సేవలు కొనసాగుతాయని వెల్లడించారు.
తను చేస్తున్న ప్రతి కార్యక్రమంలో తనకు అన్ని విధాలుగా సహకరిస్తున్న శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులకు వాసవి క్లబ్ ప్రతినిధులకు అలాగే జనసేన పార్టీ నాయకులకు ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.