జనసేనలో చేరిన మత్స్యకార యువత

పాయకరావుపేట నియోజకవర్గం, నక్కపల్లి మండలం, అమలాపురం పంచాయితీ మత్సకార యువత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు జనసేనపార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వైసీపీ, టీడీపీ పార్టీకి చెందిన సుమారు 20 మంది జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వీరికి బుజ్జి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మీకు ఏ విధమైన సహాయం కావల్సిన అందుబాటులో ఉంటానని వారికి భరోసా కల్పించారు.