అభివృద్ధి మీద దృష్టి పెట్టండి: మండెల బాబి నాయుడు

రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, మలికిపురంలో ప్రధాన రహదారి రోజూ వేలాదిమంది ప్రయాణం చేసే ప్రధాన రహదారి ఇది. గుంతలు తప్ప రోడ్డు లేని పరిస్థితి, పట్టించుకోని అధికారులు పట్టించుకోని అధికార పార్టీ నాయకులు శుక్రవారం రాజోలు నుంచి అంతర్వేది వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఈ గుంతల వల్ల మలికిపురం మెయిన్ రోడ్ లో బస్సు టైరు ఊడి పడిపోవడం జరిగింది. అదృష్టం కొద్దీ ప్రయాణికులు ఎవరికీ ఏమీకాలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు స్పందించి రోడ్డు వేయించల్సిందిగా కోరుతున్నామని, జనసేన పార్టీ తరఫున దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. దానికి నిదర్శనమే ఈ రోడ్డు ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు కళ్ళు తెరవండి అభివృద్ధి మీద దృష్టి పెట్టండని కోరిని శంకరగుప్తం జనసేన పార్టీ గ్రామశ్ఖ అద్యక్షులు మండెల బాబి నాయుడు కోరడం జరిగింది.