ఎవరెస్టుకు పాదయాత్ర చేస్తున్న జనసైనికునికి ఘనస్వాగతం

ఉమ్మడి మెదక్ జిల్లా, జనసేన పార్టీ వ్యవస్థాపక అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా సుఖసంతోషాలతో ఉండాలని జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 2023-2024 శాసనసభ ఎన్నికలలో ఘనివిజయం సాధించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని మరియు తెలంగాణా రాష్ట్రంలో కూడా మెరుగైన ఫలితాలు సాధించి జనసైనికులు శాసనసభ ఎన్నికలలో పోటీ చేస్తున్న వారందరికీ మెరుగైన ఓటింగ్ వచ్ఛి తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై జనసేన పార్టీ గళం వినిపించాలని కోరుతూ జనసైనికులు చందు కుంభా ఆధ్వర్యంలో జనసైనికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం, రాజుపాలెం మండలం, గణపవరం నుండి పాదయాత్ర చేస్తూ ఎవరెస్టు పర్వతం మీద జనసేన పార్టీ జెండా మరియు భారత జాతీయ జెండాను ఎగురవేయాలనే సంకల్పంతో శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లా చేగుంట చేరుకున్న సమయంలో హైదరాబాద్ ఎల్ బి నగర్ నియోజకవర్గం జనసైనికుడు వెంకట సాయి ప్రసాద్ కోటిపల్లి సలహా సూచన మేరకు చేగుంట జనసైనికులు ప్రశాంత్ ఆధ్వర్యంలో యాత్ర చేస్తున్న జనసైనికునికి సాదర స్వాగతం పలికి భోజన వసతి ఏర్పాటు చేసి, ధనసహాయం చేసి పాదయాత్ర చేస్తూ అనుసరించి సాగనంపారు. ఈ సందర్భంగా ప్రశాంత్ గబ్బర మాట్లాడుతూ తన యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసి ఎవరెస్టు శిఖరంపై జనసేన పార్టీ జెండా ఎగురవేసే తిరుగు ప్రయాణంలో ఆరోగ్యంగా, సంతోషంగా తన ఇంటికి చేరుకోవాలని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.