శ్రీరంగపురం గ్రామంలో “నా సేన కోసం – నా వంతు”

గుంటూరు జిల్లా, పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు మండలం శ్రీరంగపురం గ్రామంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు చెరుకూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో “నా సేన కోసం – నా వంతు” కార్యక్రమాన్ని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు ప్రారంబించి గ్రామములోని జనసైనికులచేత శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మనము నేడు ఈ గ్రామములో “నాసేనకోసం- నావంతు” కార్యక్రమం చేయటం కొరకు గ్రామ జనసైనికులు, గ్రామ పెద్దలు, యువకులు అందరూ కలసికట్టుగా పనిచేయాలని ఆయన అన్నారు. ప్రతి కుటుంబంలోని సభ్యులందరూ తమ వంతు బాధ్యతగా భావించి ఇలాంటి బృహత్తరమైన కార్యాన్ని విజయవంతం చేయటం కోస అందరూ ముందుకు రావాలని మార్కండేయ బాబు గ్రామ జనసైనికులను ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, జిల్లా కార్యదర్శి మేకల రామయ్య యాదవ్, చేబ్రోలు మండలం అధ్యక్షుడు చందు శ్రీరాములు, జనపునేని సాంబశివరావు, గోపి శ్రీనివాసరావు, చెరుకూరి శ్రీనివాసరావు, తిరుమలశెట్టి గోపి, సవాళ్ళు సాంబశివరావు, సవాళ్ళు నరసింహస్వామి, కాకర్ల ప్రేమ్ కుమార్, చుట్టూ కాలేశ్వరరావు, చెరుకూరి సాయి, నారిశెట్టి అంజయ్య, నారిశెట్టి వాసు, దోడ్డా వినయ్, కారుమంచి కోటేశ్వరరావు తదితర జనసైనికులు పాల్గొన్నారు.