ఇచ్ఛాపురం జనసేన ఆధ్వర్యంలో “నా సేన కోసం – నా వంతు”

ఇచ్ఛాపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు “నా సేన కోసం – నా వంతు” అనే కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామాల్లో విస్తృత స్థాయిలో ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యంతో శనివారం కొలిగాం పంచాయితీలో ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు, జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా ఆధ్వర్యంలో కొలిగాం పంచాయితీ జనసైనికులు కిరణ్, రవి, బాలరాజు, సోమేష్, శ్రీనివాస్, గోపి, కేశవ, శంకర్, వల్లభ, కురేష్, చిరంజీవి, మన్మధ, సహాయ సహకారాలతో “నా సేన కోసం నావంతు” కార్యక్రమంను మొదలు పెట్టి, జనసేన పార్టీలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, కార్పోరేట్ వ్యక్తులు నుండి పార్టీకి వచ్చే వందల కోట్లు కాకుండా సామాన్య ప్రజలు మంచి మనసుతో ఇచ్చే 10 రూపాయిలు అయిన తీసుకొని నిజాయతీగా పార్టీని ముందుకు తీసుకు వెళ్ళాలనే ఉద్దేశ్యంతో ప్రతీ ఇంటికి వెళ్లి ఈ కార్యక్రమం కోసం వివరించడం జరిగింది. ప్రజలు నుండి కూడా విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో ఇచ్ఛాపురం మున్సిపాలిటీ 9, 10వ వార్డు ఇంఛార్జిలు సంతోష్ మహారనా, రోకళ్ళ భాస్కర్, హారిపురం సర్పంచ్ అభ్యర్థి డి.నూకరాజు, దుంగు భాస్కర్ రెడ్డి, మురళి, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.