క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన గిద్దలూరు జనసేన

ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజక వర్గం: జనసేన పార్టీ అధ్యక్ష్యులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. గిద్దలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి బెల్లంకొండ సాయి బాబు నాయకత్వంలో క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గిద్దలూరు మండలంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జి బెల్లంకొండ సాయి బాబు మాట్లాడుతూ.. జనసేన పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్త గురించి భీమా చేయించిన మొదటి నాయకులు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. సభ్యత్వాలు చేపించిన వాలంటీర్స్ కు సన్మానం చేసారు. సభ్యత్వం కిట్స్ పంపిణీ చేశారు. 2024 ఎన్నికల్లో మనమందరం శ్రమించి జనసేన ప్రభుత్వం చూడాలి అన్నారు.. జిల్లా కార్యదర్శి లంక నరసింహ రావు, సంయుక్త కార్యదర్శులు కాల్వ బాలరంగయ్య, గజ్జలకొండ నారాయణ, గిద్దలూరు మండల అధ్యక్షులు పగడాల సాయి ఈశ్వర్, అనురాజుల రాజశేఖర్, కోమరొలు మండల అధ్యక్షులు సారే ఓబులేష్, రాచర్ల మండల నాయకులు సిద్ధం వెంకటేశ్వర్లు సభను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజేషన్ కమిటీ నాయకులు బెల్లంకొండ చంద్రశేఖర్ గిద్దలూరు మండల నాయకులు శిరుమని రాయుడు, గజ్జి లక్ష్మయ్య, ఇల్లురి రవికుమార్, పగడాల సాయికిషోర్, మోరిమిసెట్టి బాలగురుస్వామి, గద్దె సుబ్బారాయుడు, శిద్దని వెంకటేశ్వర్లు, ఏర్రగల్ల బాల శ్రీకాంత్, పంకజ్ గుప్తా, రాచర్ల మండల నాయకులు అలిశెట్టి వెంకటేశ్వర్లు, బెస్తవారపెట మండలం నాయకులు ఇళ్ళూరి అనిల్ కుమార్ పాల్గొని జయప్రదం చేశారు.