వెన్నపు బాబ్జిని పరామర్శించిన మాకినీడి శేషుకుమారి

  • కష్టంలో కాపాడే గుణం
  • ఆపదలో ప్రాణాన్ని నిలబెట్టే ధైర్యం
  • జనసైనికులకే సొంతం
  • పిఠాపుర ఇన్చార్జి మాకినీడి శేషుకుమారి

కాకినాడ జిల్లా, పిఠాపురం మండలం మల్లం గ్రామ జనసైనికుడు వెన్నపు బాబ్జి కొరకు పిఠాపురం నియోజకవర్గ నాయకులు పి ఎస్ ఎన్ మూర్తి ప్లేట్లెట్స్ దానం చేశారు. జనసేనాని ఆశయాలు, మానవత్వం ముందు ఎవరు సాటి రాగలరు? పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం మల్లం గ్రామానికి చెందిన వెన్నపు బాబ్జి అనే వ్యక్తికి డెంగ్యూ జ్వరం బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురై రక్త కణాలు ప్లేట్లెట్స్ పడిపోయిన కారణంగా, వారికోసం ఆగమేఘాలపైన పిఠాపురం ఇన్చార్జి అయిన మాకినిడి శేషుకుమారి పిలుపుపై పుణ్యమంతుల సూర్యనారాయణ మూర్తి అలియాస్ బాబురావు ప్లేట్లెట్స్ ని దానం చేసి ఆపద నుంచి రక్షించారు. ఎంతో మానవత్వంతో కూడిన గొప్ప విషయంగా పలువురు జనసైనికులు, నాయకులు మూర్తిని అభినందించి ఉన్నారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా శనివారం ఆయన స్వగ్రామం మల్లం గ్రామానికి వెళ్లి వెన్నపు బాబ్జిని పలకరించడం జరిగింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని చెప్పడం కూడా జరిగింది ఇదంతా మూర్తి అలాగే డాక్టర్ వీరప్రసాద్ దయవల్ల నేను ధైర్యంగా ఉన్నానని తెలియజేశారు. ఈ సందర్భంగా జనసైనికుడిని ఎంతో మెచ్చుకుని మాకినీడి శేషుకుమారి అభినందనలు తెలిపారు.