పుంగనూరులో నాల్గవ రోజు క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక కిట్ల పంపిణీ కార్యక్రమం అంగరంగ వైభవంగా నాల్గవ రోజు రొంపిచర్ల మండల పార్టీ అధ్యక్షుడు అంచెల రెడ్డి శేఖర్ రాయల్ అధ్వర్యంలో సోమల మండల కన్వీనర్ నాగభూషణం అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి పగడాల రమణ హాజరయ్యారు. క్రియాశీల సభ్యత్వం చేసుకున్న వారికి కిట్లను అందించడం జరిగింది. మరియు సభ్యత్వం చేసిన చైతన్య రాయల్, రెడ్డి శేఖర్, నాగభూషణంను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విరూపాక్ష, గాజుల నరేష్ రాయల్, హరి నాయక్, ఎస్ ఎస్ బవజన్, లోకా యుగంధర్, పి గుణశేఖర్, గణేష్, రుకేష్ తదితరులు పాల్గొన్నారు.