‘బత్తుల’ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సర్వీసులు
- జనసేన ఉచిత అంబులెన్స్ సర్వీసులు
- మూడు మండలాలకు మూడు అంబులెన్సులు
- 24X7 అందుబాటులో ఉండేలా కార్యాచరణ
- మెరుగైన వైద్యం అందించడానికి పరోక్ష సహకారం
రాజానగరం, ప్రజాసేవ చేయడంలో ఎప్పుడూ ఒక్క అడుగు ముందుండే జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకై ముందడుగు వేస్తూ గతంలో తాను మాట ఇచ్చిన మాట ప్రకారంగానే విజయదశమి కంటే ముందుగానే రాజానగరం నియోజకవర్గంలో మూడు మండలాలకు మండలానికి ఒకటి చొప్పున ఉచిత అంబులెన్స్ సర్వీసులు కొత్తవి ప్రారంభించనున్నారు బత్తుల బలరామకృష్ణ. దీనికి సంబంధించిన ఏర్పాట్లు విజయదశమి కంటే ముందుగానే ఇవ్వాలనే ఉద్దేశంతో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. మండలానికి ఒకటి చొప్పున 24X7 ఇవి ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. రాజానగరం నియోజకవర్గంలో నలుమూలలా ఏ గ్రామంలో ఎవరికి ఏ అనారోగ్య సమస్య వచ్చినా, ఏదైనా ప్రమాదం సంభవించినా, సంబంధిత ఫోన్ నెంబరుకు కాల్ చేసిన వెంటనే తక్షణమే వారిని సంబంధిత హాస్పిటల్ కి ఉచితంగా తరలించి, వారికి కావాల్సిన మెరుగైన వైద్యం అందించడానికి పరోక్షంగా సహకరిస్తారు. ఈ ఉచిత అంబులెన్స్ సర్వీస్ నిర్వహణకు పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందని తెలిసి కూడా ఏమాత్రం వెనకాడకుండా ఇచ్చిన మాట ప్రకారం త్వరితగతిన వాటికి కావాల్సిన పనులు పూర్తి చేయించి త్వరలో 3 మండలాల ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు బత్తుల బలరామకృష్ణ. ఈ ఉచిత అంబులెన్స్ సర్వీసుల పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ… బలరామకృష్ణ సేవాతత్పరతను కొనియాడుతున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-15-at-19.19.44-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-15-at-19.19.45-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-15-at-19.19.45-1-768x1024.jpeg)