జిల్లాలో మొదటి స్థానంలో “అత్తిలి-1” సచివాలయం

పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు నందు 73 వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా, మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ విభాగంలో “అత్తిలి-1” సచివాలయం జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్చంచ్ శ్రీమతి ‘గంటా విజేత’కి, సచివాలయ సిబ్బందికి పలువురు అభినందనలు తెలియజేశారు. గంటా విజేత జనసేన పార్టీ నాయకురాలు కావడం జిల్లా జనసైనికులు అందరికీ గర్వకారణం అని ఈ సందర్భంగా జనసేన నేతలు ప్రశంసలు కురిపించారు.