దాసరి లక్ష్మీ దుర్గ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

గుంటూరు పరిధిలోని 16 డివిజన్, బుడంపాడు గ్రామంలో 16 డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మీ దుర్గ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు శంకర కంటి ఆసుపత్రి వారి సహకారంచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకొని ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా కంటి చూపుకు సంబంధించినటువంటి కళ్ళజోళ్ళు మరియు ఆపరేషన్ చేయించుకొనుటకు ఉచితంగా వారికి వెసులుబాటును కల్పిస్తూ సంఘర్ఖండ్ ఆసుపత్రి వారు సహకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది, 46వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి యర్రంశట్టి పద్మావతి, గుంటూరు నగర ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరతయ్య, నగర ఉపాధ్యక్షులు చింత రేణుక రాజు, నగర కార్యదర్శి పావులూరి కోటేశ్వరరావు, 16 డివిజన్ ప్రెసిడెంట్ విష్ణుమొలకల ఆంజనేయులు, డివిజన్ నాయకులు దాది ఆంజనేయులు, చింత పార్థసారథి, ఆములోతు నాగరాజు, మన్నే స్వాములు, ఆకుల సతీష్, కుర్రా రవి, మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.