చిరుపవన్ సేవాసమితి ఉచిత మంచి నీటి సరఫరా

రాజోలు: జనసేన పార్టీ నాయకులు మరియు గొంది గ్రామ ఉపసర్పంచ్ ఆకన బాబ్జీనాయుడు అందించిన ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా సోమవారం గొంది గ్రామం పద్మరాజు గారి కాలని మరియు గుడిమెళ్ళంక గ్రామంలో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని రాజోలు జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.