రాజోలు జనసేన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

రాజోలు నియోజకవర్గం: గ్రామ గ్రామాన ఉచిత వైద్య శిబిరంలో భాగంగా ఆదివారం రామరాజు లంక గ్రామంలో జనసేన నాయకులు చింతలమోరి సర్పంచ్, విజయ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేష్ బాబు సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు విశిష్ట అతిథిగా విచ్చేసి, ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రామరాజు లంక గ్రామ జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం లో సుమారు 180 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు, రామరాజులంక గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.