జి. మూలపాలెంలో ఇంటింటికి జనసేన – పవన్ రావాలి పాలన మారాలి

ముమ్మిడివరం నియోజకవర్గం: ఇంటింటికి జనసేన – పవన్ రావాలి పాలన మారాలి కార్యక్రమంలో భాగంగా ఐ. పోలవరం మండలం జి. మూలపాలెం గ్రామంలో పితాని బాలకృష్ణ ఇంటింటికి పర్యటించారు. కార్యక్రమంలో
ముందుగా జి మూలపొలం గ్రామంలో కనకదుర్గమ్మను ఆంజినేయస్వామి వారిని దర్శించి, గ్రామదేవత సత్తమ్మతల్లి అమ్మవారిని దర్శించి, వారి ఆశీస్సులు తీసుకుని, భారతరత్న బి. ఆర్ అంబేద్కర్ కు పూలమాల అలంకరరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ గారు ఐ పోలవరం మండలం జి.మూలపొలం గ్రామంలో అంబేద్కర్ కాలనీ తూముకాడపేట గ్రామాలలో ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంచి గాజు గ్లాస్ పై ఓటు వేసి బాలకృష్ణ గారిని గెలిపించాలని కోరారు. గ్రామంలో ఉన్న సమస్యలైనా వాటర్ సమస్యలు, ఇంటిలోన్ సమస్యల గురించి తెలుసుకుని వాటిని కచ్చితంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వంలో అని సమస్యలు తీరుస్తానని హామీఇచ్చారు. జి మూలపొలం గ్రామంలో జి.మూలపాలెం నుండి కాట్రేకోన మండలం గొల్లగరువు కు గోదావరి బ్రిడ్జి ఎప్పటినుండో పూర్తిగా కాకుండా అలాగే ఉందని ఇది ప్రభుత్వ వైఫల్యమని, జి. మూలపొలం గ్రామంలో మత్సకార కమ్యూనిటీ హాలు పునాది వేసి 15 సంవత్సరాలు దాటినా పూర్తికాలేదు అని, కచ్చితంగా మా ప్రభుత్వంలో ఇలాంటివి చేసిపెడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు, జిల్లా కార్యవర్గసభ్యులు, మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.