అనుమతులు వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తాం

సత్తెనపల్లి నియోజకవర్గ నేత బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో జరుగుతున్న జనసేన-తెలుగుదేశం సంకల్ప పాదయాత్రను పోలీసులు అడ్డుకున్న క్రమంలో సత్తెనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో 5వ రోజు చేపట్టిన రిలే నిరాహార దీక్ష రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న జనసైనికులు. శాంతి యుతంగా సాగే ఈ సంకల్ప యాత్రకు ఇక్కడి స్థానిక పోలీసులు అనుమతి ఇవ్వని పక్షంలో కోర్టు ద్వారా అనుమతులు తెచ్చుకొని సంకల్ప యాత్రను కొనసాగిస్తామని, అనుమతులు వచ్చే వరకు వరకు ఈ రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తామని ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు అన్నారు. ఈ కార్యక్రమానికి సి.పి.ఐ మహిళా నాయకురాలు వంకాయలపాటి రాణీ మద్దతు తెలిపారు. ఈ దీక్ష కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, సత్తెనపల్లి 7వ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు బత్తుల కేశవ, చిలక పూర్ణ, అంకమ్మరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.