జనసేనాని కోసం గంగానమ్మ గుడిలో ప్రత్యేక పూజలు

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గత మూడు రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం విధితమే. అయన త్వరగా కోలుకోవాలని, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ యర్రబాలెం గ్రామ జనసేన నాయకులు, కార్యకర్తలు స్థానిక గంగానమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు నాయకులు బత్తినేని అంజయ్య, కాపరౌతు సుందరయ్య, వీర మహిళలు రాజేశ్వరి, పావని, తిరుమలేశ్వరి పాల్గొన్నారు. అనంతరం అంజయ్య మీడియాతో మాట్లాడడం జరిగింది.