ఎచ్చెర్ల జనసేన ఆధ్వర్యంలో గడప, గడపకు జనసేన

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, జి.సిగడాం మండలం, ముందుగా మర్రివలస పంచాయతీలో అంబేద్కర్ విగ్రహానికి నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ పూల మాలలు వేసి నమస్కారించుకున్నారు. అలాగే పాలఖ్యండ్యాం, గేదెలపేట, టిడివలస, మెట్టవలస జనసేన పార్టీ క్యాలెండర్ లను ప్రతి ఇంటికి అందించడం జరిగింది. అందించి జనసేన పార్టీ సిద్ధాంతాలను గడప, గడపకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జి.సిగడాం నాయకులు సందీప్ విక్రమ్, శివ, ధనంజేయ్, సందీప్, నాగారాజు, రాంబాబు, లావేరు మండల నాయకులు దుర్గారావు, బాబాజీ జనసైనికులు పౌల్గొన్నారు.