ఆపదలో ఉన్న వారి కుటుంబానికి తాము అండగా వుంటాం: చింతామని జనసేన యూత్

చిత్తూరు, జనసేన పవన్ కళ్యాణ్ పేరు మీద ముద్రించిన నూతన సంవత్సర క్యాలండర్స్ ను చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత కి అందచేసిన చింతామణి జనసేన యూత్. ఆపదలో ఉన్న వారి కుటుంబానికి తాము అండగా వుంటామని… ప్రతీ నెల రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రోగులకు అండగా ఉంటున్నామని, సామాజిక కార్యక్రమాలు చింతామణిలో చేస్తున్నామని భవిష్యత్తులో కూడా ప్రజలకు ప్రయోజనం కలిగే కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసెన ఆర్.ఆర్ రెడ్డి(ప్రెసిడెంట్) గిడ్డు, మురళి, గని, కుమార్, సునీల్, షాబు, ప్రవీణ్, సంతు, శివ, ప్రసన్న, హరి మరియు సతీష్ పాల్గొన్నారు.