పార్టీ లైన్ ప్రకారమే ప్రతి కార్యకర్త పని చేయాలి: గాదె

గురజాల: ఆదివారం పిడుగురాళ్ల మండల జనసేనపార్టీ అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి కాసిం సైదా ఆధ్వర్యంలో పిడుగురాళ్ల పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ సువత్సలా సమేత ప్రసన్నంజనేయ స్వామి వారి కళ్యాణం మరియు రధోత్సవ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు గురజాల నియోజకవర్గ నాయకులు పాల్గొనడం జరిగింది. ముందుగా పార్టీ ఆఫీస్ నందు గాదె వెంకటేశ్వరరావు చేతుల మీదగా పిడుగురాళ్ల మండల జనసేనపార్టీ క్యాలండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. తదనంతరం ప్రసన్నంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేస్తున్నటువంటి మండల ఉపాధ్యక్షుడు బయ్యవరపు రమేష్ కి దుశ్శాలువతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాదె వెంకటేశ్వరరావు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ గురజాల నియోజకవర్గ కార్యకర్తలు అందరూ పార్టీ అభివృధ్ధికోసం పని చేయాలని సోషల్ మీడియాలో నాలుగు పోస్టులు పెడితోనో, నలుగురిలో ముందు వరుసలో నించుంటేనో నాయకులు కారని, అందరూ గ్రౌండ్ లెవల్లో పనిచేయాలని పని చేసేవారిని కచ్చితంగా పార్టీ గుర్తిస్తుందని అన్నారు. దానికి నిదర్శనమే ఇప్పుడు ఉన్న కమిటీలు అని, ఎప్పటినుండో పార్టీ కి చేస్తున్న సేవలకు గాను వారికి గుర్తింపు లభించిందని తెలియచేశారు. ప్రతి ఒక్కరు మీ ప్రాంతాల్లో ఉన్న సమస్య లను వెలికితీయడంలో దృష్టి సారించి పార్టీ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. కార్యకర్తలందరూ పార్టీ విధానాల ప్రకారం ప్రోటోకాల్ పద్దతిలో నడుచుకోవాలని అలా కాదని ఎవరైనా సొంత విధానాలతో పని చేయాలని చూస్తే వారిని సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు, నాలుగు మండలాల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, ప్రోగ్రాం కమిటీ సభ్యులు, వీరమహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.