Madira: సేవే లక్ష్యంగా పని చేస్తాం – గంధం ఆనంద్

జనసేన పార్టీ తెలంగాణ విద్యార్థి విభాగం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కార్యనిర్వాహక సభ్యునిగా ఎన్నికైన గంధం ఆనంద్.

తెలంగాణలో జనసేన పార్టీ సంస్థ గత నిర్మాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యార్థి విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్ పాల్గొని విద్యార్థి విభాగం కమిటీ పేర్లను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఖమ్మం జిల్లా జనసేన విద్యార్ది విభాగంలో మధిర నియోజకవర్గం నుంచి కార్యనిర్వహక సభ్యునిగా గంధం ఆనంద్. బోనకల్ మండలం గార్లపాడు గ్రామానికి చెందిన గంధం ఆనంద్ కి అవకాశం కల్పించిన జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ ఖమ్మం జిల్లా ఇంఛార్జి శ్రీ రామ్ తాళ్లూరి, విద్యార్ది విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సంపత్ నాయక్, జనరల్ సెక్రటీరి రామకృష్ణ, ఆర్గనైజ్ సెక్రటరి కొండా పవన్ కుమార్ లకు ప్రత్యేక ధన్యవాదాలు మాపై ఉంచిన ఈ బాధ్యతని కర్తవ్యం తో నిర్వహిస్తామని… సేవే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేసారు.