రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుంది.

పాలమూరు-రంగారెడ్డి భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడం చాలా బాధాకరం. పరిహారం కోసం నార్లాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులు ఆందోళన చేస్తుండడం చాలా బాధాకరం .ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వం వెంటనే గుర్తించి పాలమూరు రంగారెడ్డి నిర్వాసితులకు వెంటనే తగిన న్యాయం చేయవలసిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రైతులకు అండగా రైతుల పక్షాన జనసేన పార్టీ ఎప్పుడు అండగా పోరాడుతుందని జనసేన పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గ నాయకులు బైరపోగు సాంబశివుడు విలేకరుల సమావేశంలో తెలిపారు. అలాగే రైతులకు న్యాయం జరిగే వరకు జనసేనపార్టీ అండగా ఉంటుందని తెలిపారు.