జయనగర్ కాలనీలో జనసేన, టిడిపి, బిజెపిల ఇంటింటా ఉమ్మడి ప్రచారం

కళ్యాణదుర్గం పట్టణం, జయనగర్ కాలనీలో బుధవారం జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ చౌదరి జనసేన, టిడిపి ఉమ్మడిగా ఇంటింటా ప్రచారం కళ్యాణదుర్గం పట్టణ మున్సిపాలిటీలోని జయనగర్ కాలనీలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా పార్టీ మేనిఫెస్టో అంశాలను, సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటికి వివరించడం జరిగింది. జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ సూచనలతో ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరపున జనసేన వీరమహిళ షేక్ తార, పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ, కళ్యాణదుర్గం మండల అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, కళ్యాణదుర్గం మండల ప్రధాన కార్యదర్శులు కార్తీక్, కళ్యాణదుర్గం మండల కమిటీ సభ్యులు అనిల్ పాల్యం, ముఖ్య నాయకులు రుహుల్ల, చిత్తప్ప, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.