ఇప్పటం ప్రజలపై వైసిపి అరాచకాన్ని ఖండించిన గంధంశెట్టి

గుంటూరు జిల్లా, ఇప్పటం గ్రామ ప్రజలపై వైసిపి ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు గంధంశెట్టి దినకర్ బాబు తీవ్రంగా ఖండించారు.. ఈ సందర్భంగా దినకర్ బాబు మాట్లాడుతూ 2022 మార్చి 14వ తేదీన ఇప్పటం గ్రామ ప్రజలు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సమావేశానికి తమ భూములు ఇచ్చారని కక్షపూరిత కారణంతో, ఆ కారణంగా మచిలీపట్నం రైతులను కూడా భయబ్రాంతులకు గురి చేయాలనే దురుద్దేశంతో అక్కడి వైసిపి నాయకులు వైసిపి ప్రభుత్వం ఇలాంటి దమనకాండ చేపడుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి రాజకీయ విమర్శలను చేయబోమని సదుద్దేశంతో జనసేన పార్టీ తీర్మానించిందని, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా వైసిపి ప్రభుత్వానికి లేకుండా పోయిందని ఆక్షేపించారు. రాబోయే 2024 ఎన్నికలలో ఇలాంటి దుష్ట నీతికి, రాక్షస ప్రవృత్తికి తగిన సమాధానం జనసేన పార్టీ తెలియజేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తప్పులు తెలుసుకొని రోడ్డు విస్తరణ, అభివృద్ధి అనే దొంగ పదాలను వాడకుండా ఇపటం గ్రామ ప్రజలకు ప్రశాంతమైన జీవితం కోసం వదిలేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.