శ్రీనాద్, తిలక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన గంగారపు స్వాతి

మదనపల్లి మండలం, చీకలబయలు పంచాయితీ బార్లపల్లి వద్ద జరిగిన ఆక్సిడెంట్ లో చనిపోయిన శ్రీనాద్, తిలక్ కుటుంబ సభ్యులను జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గంగారపు స్వాతి మరియు గంగారపు వెంకట్ నరేన్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలతో కలసి పరామర్శించారు. అనంతరం శ్రీనాథ్, తిలక్ వారి తల్లి తండ్రులకు ధైర్యం చెప్పి వారికీ ఒక్కొక్కరికి 25000 వేల రూపాయలు ఆర్థిక సాయం చేసారు. ఈ కార్యక్రమంలో లవన్న, సరోజ, రూరల్ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్, పట్టణ ప్రధాన కార్యదర్శి గండికోట లోకేష్, రూరల్ ఉపాధ్యక్షులు కుమార్, జనర్దన్, రాజారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి వరికోళ్ల నాగరాజు, రమేష్, ఆంజనేయులు, సుబ్రహ్మణ్యం, మురళి, జెస్వంత్ తదితరులు పాల్గొన్నారు.