జనసేన కేంద్ర కార్యాలయంలో వైభావంగా క్రిస్మస్ వేడుకలు

హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ ఆద్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. అనంతరం శ్రీ శంకర్ గౌడ్ మరియు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ వీరమహిళా చైర్మన్ శ్రీమతి కావ్య, వైస్ చైర్మన్ నిహారిక మరియు జయ కళ్యాణి (పార్టీ కార్యాలయం), అర్గనైజింగ్ సెక్రటరీ లిఖిత, వెంకట లక్ష్మి, జ్యోతి, పద్మజ, స్వప్న, జనసేన యువజన నాయకులు సాకేత్, అజయ్ కుమార్, పైడి రమేశ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.