జనసేన పార్టీ నార్పల మండలం అధ్యక్షుడిగా గంజికుంట రామకృష్ణ

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నార్పల మండలం అధ్యక్షుడిగా నార్పల గంజికుంట రామకృష్ణను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యంగా ఈ బాధ్యతలు అప్పగించిన అధ్యక్షుడు శ్రీపవన్ కళ్యాణ్ కి శ్రీ నాదెండ్ల మనోహర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా జిల్లా నాయకులు టిసి వరుణ్ కి మరియు జిల్లా కమిటీ సభ్యులకు, నియోజకవర్గ నాయకులు శ్రీ మురళీ కృష్ణకి, పద్మావతికి, శ్రీ పెండ్యాల హరికి ధన్యవాదాలు తెలుపుతూ, మండలంలో పార్టీ బలోపేతానికి, మండల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చొప్ప చంద్ర, పురుషోత్తమ రెడ్డి, కృష్ణమూర్తి మరియు సింగనమల నియోజకవర్గ నాయకులు విశ్వనాథ్ రెడ్డి, తుపాకుల భాస్కర్, కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.