వాసు శివప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన గర్భాన సత్తిబాబు, కూరంగి నాగేశ్వరరావు

పాలకొండ మండలం, రామభద్ర పేట గ్రామానికి చెందిన క్రియాశీలక కార్యకర్త వాసు శివ ప్రసాద్ కుటుంబాన్ని పాలకొండ నియోజకవర్గం జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు మరియు కూరంగి నాగేశ్వరరావు పరామర్శించడం జరిగింది. తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన ఆ కుటుంబాన్ని గర్భాన సత్తిబాబు ఓదార్చారు. మరియు స్థానిక పొట్లి గ్రామ జనసైనికులు, గర్భాన సత్తిబాబు చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని విధాల ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్తామని గర్భాన సత్తిబాబు అన్నారు. ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.