జీహెచ్ఎంసీ ఎన్నికలు ట్రైలర్ మాత్రమే..

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సందర్బంగా నటి, బీజేపీ నేత కుష్బు స్పంధించారు. హైదరాబాద్ లో బీజేపీ తన సత్తాచాటుకుంటుందని, దక్షిణ భారతదేశంలో మరో ముందడుగు పడుతోందని..అధికార పార్టీకి చుక్కలు చూపిస్తామని నటి కుష్బు అన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే, ముందుముందు బాహుబలి కంటే పెద్ద సినిమా ఉంటుంది, కథ ఇంకా రసవత్తరంగా ఉంటుంది, మీరే చూస్తారు కదా అంటూ నటి కుష్బు ట్విట్ చేశారు.

దక్షిణ భారతదేశంలో బీజేపీ తన సత్తా చాటుకోవడానికి జీహెచ్ఎంసీ ఎన్నికలు చక్కటి అవకాశంగా వచ్చిందని నటి కుష్బు అంటున్నారు. ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది, దక్షిణ భారతదేశంలో బీజేపీ పుంజుకుంటుంది, ఇక్కడ మేము అధికారంలోకి వస్తామని నటి కుష్బు ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రామ్ రామ్ చెప్పి నటి కుష్బు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.